Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (15:07 IST)
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, తనకున్న సమాచారం మేరకు ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మంది లోక్‌సభ సభ్యులు భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఏమైనా నక్రాలు చేస్తే టీడీపీతో బీజేపీ కటీఫ్ చేసుకుని, ఆ తర్వాత ఆ 10 మంది ఎంపీలను తమ పార్టీలో చేర్చుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. పైగా, 21 మంది ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇందులో టీడీపీకి 16 మంది, జనసేన పార్టీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు చొప్పున ఎంపీలు ఉన్నారు. మరో నాలుగు స్థానాలను వైకాపా గెలుచుకున్న విషయం తెల్సిందే. అలాగే, 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి 164 సీట్లను, వైకాపా 11 సీట్లను గెలుచుకున్నాయి. 
నేను ఓపెన్ గా చెప్తున్నా!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments