Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుల రద్దీ.. 10 ప్రత్యేక రైళ్ళు పొడగింపు

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (11:41 IST)
రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను ఈ నెల ఆఖరివారం వరకు పొడగించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇలా పొడగించిన రైళ్లలో పది ఉన్నాయి. వాటి వివరాలను ఓసారి పరిశీలిస్తే, సికింద్రాబాద్ - తిరుపతి రైలును డిసెంబరు 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పొడగించారు. ఈ రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్ రైలు ఈ నెల 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
 
ఇకపోతే, హైదరాబాద్ - నర్సాపూర్ రైలు డిసెంబరు 2 నుంచి 30వ తేదీ వరకు, నర్సాపూర్ - హైదరాబాద్ రైలు డిసెంబరు 3 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. కాకినాడ - లింగంపల్లి రైలు డిసెంబరు 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటాయి. లింగంపల్లి - కాకినాడ రైలు డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లోనూ, తిరుపతి - అకోలా, పూర్ణ - తిరుపతి మధ్య నడిచే రైళ్ళను కూడా ఇరు మార్గాల్లో నెలాఖరు వరకు పొడగించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments