Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుల రద్దీ.. 10 ప్రత్యేక రైళ్ళు పొడగింపు

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (11:41 IST)
రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను ఈ నెల ఆఖరివారం వరకు పొడగించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇలా పొడగించిన రైళ్లలో పది ఉన్నాయి. వాటి వివరాలను ఓసారి పరిశీలిస్తే, సికింద్రాబాద్ - తిరుపతి రైలును డిసెంబరు 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పొడగించారు. ఈ రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్ రైలు ఈ నెల 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
 
ఇకపోతే, హైదరాబాద్ - నర్సాపూర్ రైలు డిసెంబరు 2 నుంచి 30వ తేదీ వరకు, నర్సాపూర్ - హైదరాబాద్ రైలు డిసెంబరు 3 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. కాకినాడ - లింగంపల్లి రైలు డిసెంబరు 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటాయి. లింగంపల్లి - కాకినాడ రైలు డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లోనూ, తిరుపతి - అకోలా, పూర్ణ - తిరుపతి మధ్య నడిచే రైళ్ళను కూడా ఇరు మార్గాల్లో నెలాఖరు వరకు పొడగించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments