Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి వస్తూ తిరిగిరాని లోకాలకు....

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం అర్థరాత్రి జరిగింది.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (09:41 IST)
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం అర్థరాత్రి జరిగింది. తిరుచ్చి జిల్లా తువరన్‌కురిచ్చి దగ్గర జాతీయ రహదారిపై బోర్‌వెల్‌ వాహనాన్ని.. వ్యాన్‌ ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాగర్‌కోయిల్‌ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోర్‌వెల్‌ వాహనాన్ని డ్రైవర్‌ ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో వెనుక వస్తున్న వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ప్రమాదంలో వ్యాన్‌ నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments