Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత నాన్నకు విషమిచ్చి చంపేశారు.. అమ్మకు ఆడబిడ్డ నిజమే: అత్త లలిత

ముఖ్యమంత్రి దివంగత జయలలిత తొలి వర్థంతి వేడుకలు డిసెంబర్ 5వ తేదీ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో జయలలిత అత్త లలిత మరోబాంబు పేల్చారు.

జయలలిత నాన్నకు విషమిచ్చి చంపేశారు.. అమ్మకు ఆడబిడ్డ నిజమే: అత్త లలిత
, మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:23 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత తొలి వర్థంతి వేడుకలు డిసెంబర్ 5వ తేదీ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో జయలలిత అత్త లలిత మరోబాంబు పేల్చారు. జయలలిత నాన్నను ఆయన భార్య కొట్టి చంపేశారంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, జయలలిత - శోభన్ బాబులకు ఆడబిడ్డ పుట్టింది నిజమేనని చెప్పారు. 
 
జయలలిత మరణం అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలను కూడా జయలలిత కుటుంబీకులే వెల్లడించడం గమనార్హం. 
 
తాజాగా జయలలిత అత్త లలిత ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ, జయలలిత తండ్రి జయరామన్ మద్యానికి బానిస కావడంతో, ఆయన భార్య సంధ్య విషమిచ్చి భర్తను చంపిందని ఆరోపించారు. జయరామన్ హత్య తర్వాత ఆమె ఇగోను భరించలేక తాము ఆమెకు దూరంగా వెళ్లిపోయామని, ఆ తర్వాత జయ ఒక్కో మెట్టూ ఎదుగుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు. 
 
జయలలిత అమ్మ సినీ నటి కావడంతో కుమార్తెను సైతం ఆ దిశగానే ప్రోత్సహించిందని చెప్పారు. ఆ సమయంలో హీరో శోభన్ బాబుతో ఏర్పడిన పరిచయం కారణంగా జయలలిత గర్భం దాల్చిందనీ, ఆమెకు కాన్పు చేసింది కూడా తన పెద్దమ్మేనని చెప్పింది. ఆ బిడ్డే అమృత అని తెలిపింది. అయితే, జయకు పుట్టిన బిడ్డ అమృతేనని చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేవని అన్నారు. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ఒట్టు వేయించుకుందని లలిత వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత వర్థంతి: అనాథగా మారిన అన్నాడీఎంకే.. అమృత ఎంట్రీ ఇస్తారా?