Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (09:22 IST)
హస్తిన పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. తాను నిర్వహిస్తున్న శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు.. తన పరిధిలోకి రాని శాఖలకు చెందిన కేంద్రమంత్రులతో కూడా ఆయన తన పర్యటన తొలి రోజున సమావేశమయ్యారు. రెండో రోజైన బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. పార్లమెంట్ భవన్‌లో ప్రధాని మోడీ - పవన్ కళ్యాణ్‌‍ల సమావేశం జరుగుతుంది. 
 
అలాగే, బుధవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీయే ఎంపీలకు పవన్ విందు ఇవ్వనున్నారు. వారికి తాజ్ హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణాలో బీజేపీ ఎంపీలను పవన్ కళ్యాణ్ ఈ విందుకు ఆహ్వానించారు. 
 
మరోవైపు, మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్‌తో సమావేశమయ్యారు. దీనిపై పవన్ స్పందిస్తూ, ఉపరాష్ట్రపతిని కలవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. బిజీ షెడ్యూల్‌లోనూ తనకు సమయాన్ని కేటాయించినందుకు ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఆయన తనకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని, తనకు సాదర స్వాగతం పలికిన ఉపరాష్ట్రపతికి ధన్యవాదజాలు తెలుపుతున్నట్టు తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments