ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (09:22 IST)
హస్తిన పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. తాను నిర్వహిస్తున్న శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు.. తన పరిధిలోకి రాని శాఖలకు చెందిన కేంద్రమంత్రులతో కూడా ఆయన తన పర్యటన తొలి రోజున సమావేశమయ్యారు. రెండో రోజైన బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. పార్లమెంట్ భవన్‌లో ప్రధాని మోడీ - పవన్ కళ్యాణ్‌‍ల సమావేశం జరుగుతుంది. 
 
అలాగే, బుధవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీయే ఎంపీలకు పవన్ విందు ఇవ్వనున్నారు. వారికి తాజ్ హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణాలో బీజేపీ ఎంపీలను పవన్ కళ్యాణ్ ఈ విందుకు ఆహ్వానించారు. 
 
మరోవైపు, మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్‌తో సమావేశమయ్యారు. దీనిపై పవన్ స్పందిస్తూ, ఉపరాష్ట్రపతిని కలవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. బిజీ షెడ్యూల్‌లోనూ తనకు సమయాన్ని కేటాయించినందుకు ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఆయన తనకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని, తనకు సాదర స్వాగతం పలికిన ఉపరాష్ట్రపతికి ధన్యవాదజాలు తెలుపుతున్నట్టు తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments