ఉండి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ఆర్ఆర్ఆర్!!

వరుణ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (15:54 IST)
వైకాపా సిట్టింగ్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ దఫా తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తాను పోటీ చేసే విషయంపై సరిగ్గా 48 గంటల్లో స్పష్టత వస్తుందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉండి అసెంబ్లీ నియోకవర్గంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉండి పరిధిలోని పెదఅమిరంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. తద్వారా తాను ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. పైగా త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
అయితే ఉండి అసెంబ్లీ టిక్కెట్‌ను టీడీపీ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ టిక్కెట్‌ను రఘురామ రాజుకు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు వార్తలు రావడంతో ఎమ్మెల్యే రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఉండి అసెంబ్లీ టిక్కెట్ కోసం రామరాజు, రఘురామరాజులు పోటీ పడటంతో ఈ టిక్కెట్ మాత్రం ఆర్ఆర్ఆర్‌కే కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
రామరాజుకు ఇచ్చిన టిక్కెట్‌ను రద్దు చేసి రఘురామ రాజుకు ఇవ్వబోతున్నారనే ప్రచారం స్థానిక టీడీపీ శ్రేణుల్లో జోరుగా సాగుతుంది. ఆ ధీమాతోనే రఘురామరాజు ఉండి నియోజకవర్గంలో ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు చంద్రబాబు నచ్చజెప్పి.. ఆ టికెట్‌ను రఘురామరాజుకు కేటాయిస్తారని, తద్వారా మరో సీనియర్ నేత శివరామరాజు కూడా శాంతిస్తారని, దీంతో ఉండి అభ్యర్థి గెలుపుకోసం పార్టీ శ్రేణులన్నీ కలిసి పని చేస్తాయని వారు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments