Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు జిల్లా రెంటాలలో టీడీపీ ఏజెంట్లపై దాడి... ఈసీ సీరియస్

ఠాగూర్
సోమవారం, 13 మే 2024 (07:47 IST)
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లపై వైకాపా వర్గీయులు భౌతికదాడులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం 7 గంటలకే ఏపీలో పోలింగ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఆరు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి అధికారులు ఓటింగ్ ప్రక్రియను ప్రారభించారు. 
 
ఈ పరిస్థితుల్లో పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లపై అధికార వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్‌ పోలింగ్‌ పూర్తయిన తర్వాత.. రెగ్యులర్‌ పోలింగ్‌ ప్రారంభిస్తున్న క్రమంలో వైకాపా ఏజెంట్లు తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు. 
 
మరోవైపు, ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్‌ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై కన్నెర్రజేసింది. తక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించి సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments