Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

ఠాగూర్
సోమవారం, 13 మే 2024 (07:56 IST)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీ ఏజెంట్లకు అధికార వైకాపా నేతలు బహిరంగ వార్నింగ్‌లు ఇస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ తరపున ఏజెంట్లుగా కూర్చొనే వారిని బెదిరిస్తున్నారు. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు అంటూ టీడీపీ ఏజెంట్‌పై వైకాపా నేతలు భౌతిక దాడికి యత్నించారు. 
 
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన సన్నారెడ్డి వేణురెడ్డిని సోమవారం జరగనున్న పోలింగ్‌లో టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ తరపున ఏజెంట్‌గా నియమించారు. శనివారం రాత్రి వేణురెడ్డి తన వ్యవసాయ గోదాములో ఉండగా అదే గ్రామానికి చెందిన ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అనుచరులు, వైకాపాకు చెందిన పిల్లమేటి మురళి, పిల్లమేటి వంశీకృష్ణ, చెంచయ్య, నాగముంతల శ్రీనివాసులు వచ్చి కత్తులు, కర్రలు చూపుతూ తెదేపాకు ఏజెంట్‌గా ఎలా కూర్చుంటావని బెదిరించారు.
 
సత్యనారాయణ రెడ్డిని కాదని ఇక్కడ నీవు బతకగలవా అంటూ దుర్భాషలాడారు. 'నిన్ను ఇక్కడే చంపి, శవాన్ని పోలింగ్‌ కేంద్రానికి పంపిస్తే దిక్కు ఎవరు' అని బెదిరింపులకు దిగినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌, ఆయన అనుచరులతో ప్రాణహాని ఉందని ఆర్వోకు విన్నవించారు. దీంతో పోలింగ్ కేంద్ర వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments