Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి అసెంబ్లీ ఎన్నికల బరిలో 25 మంది స్వతంత్ర అభ్యర్థులు!

వరుణ్
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (17:31 IST)
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా మే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియగా, శుక్రవారం నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే, తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఏకంగా 25 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 
 
దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఏజెంట్లను కూడా పెట్టుకోలేని 25 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం వెనుక కుట్ర దాగుందన్నారు. చిత్తూరు నుంచి వచ్చిన రౌడీలు, గూండాలు పోలింగ్ బూత్‌‍లలో ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయించాలని, స్థానికంగా ఉన్న వారినే బూత్ ఏజెంట్లుగా నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
అంతేకాకుండా, తిరుపతిలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు కూటమి కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. చిత్తూరు నుంచి రౌడీ మూకలు, గూండాలను దింపి అల్లర్లు చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్ర కోణంపై ఎన్నికల సంఘం దృష్టిసారించాలని కోరారు. పైగా, తమపై పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థికే మొత్తం అన్ని బూత్‌లలో ఏజెంట్లను నియమించుకునే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments