Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి అసెంబ్లీ ఎన్నికల బరిలో 25 మంది స్వతంత్ర అభ్యర్థులు!

వరుణ్
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (17:31 IST)
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా మే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియగా, శుక్రవారం నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే, తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఏకంగా 25 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 
 
దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఏజెంట్లను కూడా పెట్టుకోలేని 25 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం వెనుక కుట్ర దాగుందన్నారు. చిత్తూరు నుంచి వచ్చిన రౌడీలు, గూండాలు పోలింగ్ బూత్‌‍లలో ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయించాలని, స్థానికంగా ఉన్న వారినే బూత్ ఏజెంట్లుగా నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
అంతేకాకుండా, తిరుపతిలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు కూటమి కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. చిత్తూరు నుంచి రౌడీ మూకలు, గూండాలను దింపి అల్లర్లు చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్ర కోణంపై ఎన్నికల సంఘం దృష్టిసారించాలని కోరారు. పైగా, తమపై పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థికే మొత్తం అన్ని బూత్‌లలో ఏజెంట్లను నియమించుకునే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments