Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి సేవలో భారత ఉపరాష్ట్రపతి

సెల్వి
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (16:55 IST)
Tirumala
భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంకర్ తన జీవిత భాగస్వామి శ్రీమతి సుధేష్ ధంకర్, కుటుంబ సభ్యులతో శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. తొలి దర్శనం కోసం తిరుమల ఆలయానికి శుక్రవారం చేరుకున్నారు. 
 
ఉప రాష్ట్రపతి శుక్ర‌వారం ఉదయం తిరుమలలోని ర‌చ‌న‌ విశ్రాంతి భవనంకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఉప రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు.
 
మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల క్షేత్రం ప్రాచీన భారతీయ సంస్కృతి, నాగరికతలో మహోన్నతమైనదని చెప్పారు. టీటీడీ పరిపాలన, భక్తులకు అందిస్తున్న సేవలు అన్ని మతాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments