Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూతలపట్టు వైకాపా అసెంబ్లీ అభ్యర్థిని చితకబాదిన గ్రామస్థులు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (16:02 IST)
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎస్ బాబును ఓటర్లు చితకబాదారు. ఈ సెగ్మెంట్‌లో అధికార టీడీపీకి బలమైన పట్టుంది. అయితే ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా ఎంఎస్ బాబు పోటీ చేస్తున్నారు. ఈయన గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పోలింగ్ సరళిని తనిఖీ చేసేందుకు తన అనుచరులతో కలిసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. 
 
ఈ క్రమంలో ఐరాల మండలంలోని కట్టకిందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఆ పోలింగ్ కేంద్రంలో ఓట్లన్నీ సైకిల్ గుర్తుకు పడుతున్నాయని గ్రహించిన ఆయన ఆగ్రహంతో రగిలిపోయి... ఈవీఎంలతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తిరగబడిన గ్రామస్థలు.. ఎమ్మెల్యే అభ్యర్థి బాబును పట్టుకుని చితకబాదారు. అంతేకాకుండా, ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబును ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తొలుత తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఇదే మండలంలోని రెడ్డివారిపల్లిలో కూడా టీడీపీ - వైకాపా కార్యకర్తలు, ఏజెంట్ల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. చిత్తూరు జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క పూతలపట్టు సెగ్మెంట్‌లోనే ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments