Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూతలపట్టు వైకాపా అసెంబ్లీ అభ్యర్థిని చితకబాదిన గ్రామస్థులు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (16:02 IST)
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎస్ బాబును ఓటర్లు చితకబాదారు. ఈ సెగ్మెంట్‌లో అధికార టీడీపీకి బలమైన పట్టుంది. అయితే ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా ఎంఎస్ బాబు పోటీ చేస్తున్నారు. ఈయన గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పోలింగ్ సరళిని తనిఖీ చేసేందుకు తన అనుచరులతో కలిసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. 
 
ఈ క్రమంలో ఐరాల మండలంలోని కట్టకిందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఆ పోలింగ్ కేంద్రంలో ఓట్లన్నీ సైకిల్ గుర్తుకు పడుతున్నాయని గ్రహించిన ఆయన ఆగ్రహంతో రగిలిపోయి... ఈవీఎంలతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తిరగబడిన గ్రామస్థలు.. ఎమ్మెల్యే అభ్యర్థి బాబును పట్టుకుని చితకబాదారు. అంతేకాకుండా, ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబును ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తొలుత తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఇదే మండలంలోని రెడ్డివారిపల్లిలో కూడా టీడీపీ - వైకాపా కార్యకర్తలు, ఏజెంట్ల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. చిత్తూరు జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క పూతలపట్టు సెగ్మెంట్‌లోనే ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments