తెలంగాణాలో ముగిసిన పోలింగ్... ఏపీలో బారులు తీరిన వృద్ధులు - మహిళలు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:56 IST)
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభతో పాటు దేశ వ్యాప్తంగా 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగిసింది. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల కంటే రెండు గంటలు ముందుగానే పోలింగ్ ముగించారు. నాలుగు గంటల లోపు క్యూలో ఉన్నఓటర్లను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. 
 
కాగా, ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరివున్నారు. ఫలితంగా పోలింగ్ కేంద్రాలు రద్దీగా ఉన్నాయి. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్లలో నిలబడిన ఓటర్లలో చివరి ఓటరు ఓటు వేసేంత వరకు పోలింగ్ కొనసాగుతుంది. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 16 స్థానాల్లో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగిసింది. ఒక్క నిజామాబాద్ స్థానంలో మాత్రం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ స్థానంలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments