Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త సత్తా నాకు తెలుసు.. అన్ని సీట్లు గ్యారంటీ: వై.ఎస్.భారతి

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:02 IST)
ఎన్నికలు సమీపించాయి. పోలింగ్‌కు మరో 4 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని కూడా జోరుగా సాగిస్తున్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తరపున విజయమ్మ, షర్మిళలు ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. జగన్ కూడా 13 జిల్లాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ తరపున ఆయన సతీమణి వై.ఎస్. భారతి అసలు ప్రచారం చేయలేదు. కానీ మొదటిసారి భర్త గెలుపు కోసం ఆమె ప్రచారం చేస్తున్నారు.
 
అది కూడా కడప జిల్లా పులివెందులలో. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్థి చేసుకోండి అంటూ వై.ఎస్. భారతి చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్‌ను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేస్తుండడంతో ఓటర్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వై.ఎస్. భారతి ప్రచారంలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తన భర్తకు సిఎంగా గెలిచే అవకాశం ఉందని, ఆయనలో ఆ సత్తా కూడా ఉందని, సర్వేల్లో 125 సీట్లకు పైగా వస్తాయని చెబుతున్నారని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వై.ఎస్. భారతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments