Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంను ధ్వంసం చేసిన జనసేన అభ్యర్థి .. అరెస్టు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (08:44 IST)
అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి కె.మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో వీరంగం సృష్టించాడు. గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రం బయట ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లో నియోజకవర్గం పేరు సరిగా రాయలేదనీ, అలాగే, ఈవీఎంలో తన పేరును కింద రాశారన్న ఆగ్రహంతో ఈ పనికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికి బూత్ లోపలికి వచ్చిన మధుసూదన్ గుప్తా, అక్కడున్న ఇతర పార్టీల ఏజంట్లతో గొడవ పడటమేకాకుండా, ఈవీఎంను నేలకేసి కొట్టాడు. దీంతో అది పని చేయకుండా పోయింది. అంతకుముందు ఆయన ఓటింగ్ కంపార్ట్ మెంట్లలో నియోజకవర్గం పేరును సరిగా రాయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను పోలింగ్ కేంద్రం నుంచి అరెస్టు చేసిన పోలీసు జీపులో ఎక్కించి తరలించారు. కాగా, గతంలో ఈయన ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments