Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంను ధ్వంసం చేసిన జనసేన అభ్యర్థి .. అరెస్టు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (08:44 IST)
అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి కె.మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో వీరంగం సృష్టించాడు. గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రం బయట ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లో నియోజకవర్గం పేరు సరిగా రాయలేదనీ, అలాగే, ఈవీఎంలో తన పేరును కింద రాశారన్న ఆగ్రహంతో ఈ పనికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికి బూత్ లోపలికి వచ్చిన మధుసూదన్ గుప్తా, అక్కడున్న ఇతర పార్టీల ఏజంట్లతో గొడవ పడటమేకాకుండా, ఈవీఎంను నేలకేసి కొట్టాడు. దీంతో అది పని చేయకుండా పోయింది. అంతకుముందు ఆయన ఓటింగ్ కంపార్ట్ మెంట్లలో నియోజకవర్గం పేరును సరిగా రాయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను పోలింగ్ కేంద్రం నుంచి అరెస్టు చేసిన పోలీసు జీపులో ఎక్కించి తరలించారు. కాగా, గతంలో ఈయన ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments