Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాసన చిన్నాన్నకు మద్దతుగా చిరంజీవి ప్రచారం...

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (12:29 IST)
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అదీకూడా జనసేన పార్టీ తరపున కాదు సుమా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి తన కోడలు ఉపాసనకు స్వయానా చిన్నాన్న. అందుకే ఆయన తరపున ప్రచారం చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. 
 
తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపును ప్రచారాన్ని నిర్వహించాలని చిరు నిర్ణయించారని, ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి వెల్లడించారు. మరోవైపు, మంగళవారం చిరంజీవిని కొండా విశ్వేశ్వర రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య ఎన్నికల ప్రచార ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఈనెల 8వ తేదీన ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడుగా, కేంద్ర మాజీ మంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే.,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments