Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాల మీదకు డబ్బులు విసిరేసిన వైకాపా నేత...

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:39 IST)
కొన్ని సంవత్సరాలుగా అధికారం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వైకాపా నేతలు ఎన్నికల ప్రచారంలో కూడా వింత పోకడలు పోతున్నారు. డబ్బు మత్తులో తూగుతున్నారు. అధికారం కోసం డబ్బులను మంచినీళ్లలా ప్రవహించాలని నిర్ణయించుకున్నారు. 
 
వివరాలలోకి వెళ్తే... కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల గ్రామంలో వైకాపా నేతలు డబ్బులు వెదజల్లారు. వైకాపా తరపున ఆళ్లగడ్డ నుండి పోటీ చేస్తున్న బ్రిజేందర్‌‌ రెడ్డి బుధవారం రాత్రి సిరివెళ్ల గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తూ.. వైకాపా అధినేత జగన్ నంద్యాల పట్టణంలో రానున్నారని చెప్పారు. నంద్యాలలో వైకాపాకి వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో జగన్ సభకు ఆళ్లగడ్డ, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలను నంద్యాలకు తరలించాలని భావించారు.
 
ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న బ్రిజేందర్‌‌రెడ్డి బుధవారం సదరు గ్రామానికి వెళ్లి జగన్ సభకు రావలసిందిగా ఆహ్వానిస్తూ ప్రజల మీదకు డబ్బులు వెదజల్లారు. నోట్లు అందుకునే క్రమంలో ప్రజల మధ్య తొక్కిసలాట జరిగి... కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం కూడా ఆళ్లగడ్డ, శిరివేముల పట్టణంలో ఇటువంటి సంఘటనే జరిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన తెదేపా నేతలు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments