Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు డమ్మీ ఈవీఎంలు : వైకాపా సరికొత్త ఎత్తులు?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:27 IST)
వెస్ట్ గోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రహస్యంగా తరలిస్తుండగా జిల్లాలోని కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. దాదాపు 350కు పైగా ఈవీఎంలను ఓ మినీ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. 
 
మరోవైపు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా సరికొత్త ప్రచారానికి తెరదీసింది. ఓటర్లకు అవగాహనా కల్పించే ప్రచారంలో భాగంగ, నమూనా (డమ్మీ) ఈవీఎం బ్యాలెట్ పత్రాన్ని ముద్రించింది. ఇందులో తమకు ఎన్నికల సంఘం కేటాయించిన సంఖ్య 4ను సక్రమంగానే ముద్రించింది. కానీ, టీడీపీకి ఈసీ రెండో నంబరును ముద్రించగా, దాన్ని మూడో నంబరుగా ముద్రించి ఓటర్లను గందరగోళానికి గురిచేసే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై టీడీపీ నేత బుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. 
 
కాగా, వైఎస్. జగన్మోహన్ రెడ్డి తాజాగా రాజకీయ పరిస్థితులు, ప్రచారంపై రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత బుధవారం నుంచి ఆయన గుంటూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో డమ్మీ ఈవీఎంలు హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు తరలించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments