Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలు నుంచి పరార‌యిన ఖైదీని చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న న‌గ‌రి పోలీసులు

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (18:40 IST)
సత్యవేడు సబ్ జైలు నుండి పరారైన రిమాండ్ ఖైదీని న‌గ‌రి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగరి సీఐ.మధ్దయ్యాచారి అందించిన వివరాల మేరకు నగరి పరిసర ప్రాంతాల్లో గత రెండేళ్లుగా నగరి, పల్లిపట్టు, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో 40 కి పైగా పశువుల దొంగతనం జరిగింది. పశువుల దొంగలని పట్టుకోవడం కోసం పుత్తూరు సబ్ డివిజనల్ డీఎస్పీ, డాక్టర్. టీ.డీ.యశ్వంత్ ఆదేశాల మేరకు దాదాపు 25 కేసులలో సంబంధాలున్న పశువుల దొంగ సాయి(23)ని రెండు నెలల ముందు నగరి పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ చేసి సత్యవేడు సబ్ జైలుకు పంపారు. 
 
 
సత్యవేడు జైలులో 20 రోజులు ముందు సత్యవేడు సబ్ జైల్ సిబ్బంది కళ్ళు గప్పి గోడ దూకి పరారై పోయాడు. 20 రోజులుగా సబ్ జైల్ సిబ్బంది, పోలీసులు ముద్దాయి సాయిని పట్టుకోవడంలో ఇబ్బందులు  ఎదుర్కొంటున్న నేపథ్యంలో నగరి సీఐ. మద్దయ్యచారి, తన టీంతో 4 రోజులుగా రెక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్ ప్రకారం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో పట్టుకున్నారు. విచారణలో పోలీసుల రెక్కిని గమనించిన ముద్దాయి సాయి 20 రోజులుగా ఎలాంటి  ఆహారం లేకుండా కేవలం నీరు మాత్రం తాగుతూ అజ్ఞాతంలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని నివ్వెరపోయారు. ఈ ఆపరేషన్లో సత్యవేడు సబ్ జైలు జైలర్ మ‌స్తాన్, నగరి క్రైం బ్రాంచ్ సిబ్బంది గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments