Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు పరిపాలనా రాజధాని ఖాయం : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (17:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని వదిలిపెట్టేలా లేదు. విశాఖకు పరిపాలనా రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతికి శాసన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో వైకాపా రీజినల్ కో ఆర్డినేటర్‌‌గా నియమితులైన తితిదే ఛైర్మన్, వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి ఆదివారం వైకాపాకు చెందిన నేతలు, జీవీఎంసీ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. వైజాగ్ పరిపాలనా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని చెప్పారు. 
 
వీలైనంత త్వరలో న్యాయపరమైన సమస్యలు, చిక్కులు తొలగిపోయి విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందని వెల్లడించారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. 
 
ఇకపోతే, ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన వరదలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకే విపక్షాలు వరదలను తమ రాజకీయాలకు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయన్నారు. వరద బాధితులను ప్రభుత్వ యంత్రాంగం ఆదుకుందని, అనేక లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించిందని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments