ట్రిపుల్ ఆర్‌పై వేటు వేయండి : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైకాపా లేఖ

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (21:51 IST)
ఏపీలోని అధికార పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైకాపా నేతలు లేఖ రాశారు. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఇదే అంశాన్ని వారు మరోసారి లేవనెత్తారు. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గత ఏడాది జులై 3న తమకు ఫిర్యాదు చేశామని... అయితే అకారణంగా ఈ విషయంలో జాప్యం చేస్తున్నారంటూ లేఖలో వారు పేర్కొన్నారు. 
 
పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈ లేఖపై ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 
 
మరోవైపు, తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించాలని స్పీకర్‌కు రఘురామరాజు ఇప్పటికే లేఖ రాశారు. తాను యువజన శ్రామిక రైతు పార్టీ తరపున గెలిచానని, ఎక్కడా కూడా పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించలేని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments