Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామరాజు ఐఫోన్‌ను తీసుకున్న ఏపీ సీఐడీ... లీగల్ నోటిసులు

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (09:57 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు సమయంలో ఆయన ఐఫోన్‌ను ఏపీ సీఐడీ పోలీసులు తీసుకున్నారు. ఈ ఫోనును ఇవ్వాలంటూ వారికి రఘురామ రాజు లీగల్ నోటీసులు పంపించారు. ఈ మేరకు ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌ను ఉద్దేశిస్తూ లీగల్ నోటీసు జారీ చేశారు. 
 
తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని, దాన్ని తిరిగిచ్చేయాలని కోరారు. స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని రఘురామ ఆరోపించారు. ఆ ఫోనులో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
 
పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోనులో దానికి సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉందని స్పష్టంచేశారు. పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోనును అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మంగళగిరి సీఐడీ హెచ్ఎస్ఓకు ఈ మేరకు లీగల్ నోటీసులు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments