తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు సజ్జల ఎలా చెబుతారు: వైకాపా ఎమ్మెల్యే ఆనం

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (11:32 IST)
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్‌‍కు పాల్పడినట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెబుతారని నెల్లూరు జిల్లా వెంకటగిరి వైకాపా రెబెల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తనతో పాటు మరో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు ఆరోపిస్తూ తమను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన ఖండించారు. దీనిపై ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారంగా ఓటు వేశామని చెప్పారు. అత్యంత రహస్యంగా జరిగే పోలింగ్‌లో తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. 
 
"ఆనం రామనారాయణ రెడ్డి అనే అతను మా ఎమ్మెల్యేనే కాదు. మేం అతడిని ఓటు అడగలేదు" అని సజ్జలతో పాటు వైకాపా నేతలు చెప్పారనీ, కానీ ఫలితాలు వచ్చిన తర్వాత తాను రూ.20 కోట్లు తీసుకుని క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డానని నిరాధారమన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 
 
విలేఖరిగా పని చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సజ్జల తనకు తెలుసని, ఆయన ఎలా ఎదిగాడో తనకు తెలుసని చెప్పారు. కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలని సజ్జలను మాజీ మంత్రి ఆనం నిలదీశారు. అందరూ తనలాగే ఉంటారని అనుకుంటే ఎలాగని ఎద్దేవా చేశారు. 
 
డబ్బు తీసుకుని ఓటేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు పోస్టుకు సజ్జల ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారని, మిగిలిన సలహాదారుల నుంచి ఎన్నెన్ని కోట్లాది రూపాయలు వసూలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments