Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో.. విజయసాయి వార్నింగ్

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (11:48 IST)
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ సాగుతోంది. ఈ బంద్‌కు అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
 
అలాగే, బీజేపీ మినహా కార్మిక సంఘాలు, పార్టీలు, ప్రజలు దీనిలో బంద్‌లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో బంద్‌లో పాల్గొన్న వైపీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి చుక్కెదురు అయ్యింది. మానవహారాన్ని నిర్మించుకుంటూ... ప్రజలతో మాట్లాడుతూ వెళుతున్న ఆయనకు ఓ కార్మికసంఘానికి చెందిన నాయకుడి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.  
 
పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు ఒప్పందం చేసుకున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో రహస్యంగా చేసుకున్న ఒప్పందం అంటూ ఆ వ్యక్తి మరోసారి జవాబిచ్చాడు. 
 
అధికారులకు కూడా తెలియకుండా జరిగిపోయిందా అంటూ ప్రశ్నించాడు. ఆ మాటకు విజయసాయి మండిపడ్డారు. 'కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో..  నీకు లేని అధికారాన్ని ప్రదర్శించలేవు' అంటూ గబగబా నడిచి వెళ్లిపోయాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments