Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో.. విజయసాయి వార్నింగ్

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (11:48 IST)
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ సాగుతోంది. ఈ బంద్‌కు అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
 
అలాగే, బీజేపీ మినహా కార్మిక సంఘాలు, పార్టీలు, ప్రజలు దీనిలో బంద్‌లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో బంద్‌లో పాల్గొన్న వైపీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి చుక్కెదురు అయ్యింది. మానవహారాన్ని నిర్మించుకుంటూ... ప్రజలతో మాట్లాడుతూ వెళుతున్న ఆయనకు ఓ కార్మికసంఘానికి చెందిన నాయకుడి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.  
 
పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు ఒప్పందం చేసుకున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో రహస్యంగా చేసుకున్న ఒప్పందం అంటూ ఆ వ్యక్తి మరోసారి జవాబిచ్చాడు. 
 
అధికారులకు కూడా తెలియకుండా జరిగిపోయిందా అంటూ ప్రశ్నించాడు. ఆ మాటకు విజయసాయి మండిపడ్డారు. 'కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో..  నీకు లేని అధికారాన్ని ప్రదర్శించలేవు' అంటూ గబగబా నడిచి వెళ్లిపోయాడు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments