Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులు శూన్యం : వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (08:36 IST)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ద్వారా సంక్రమించిన హక్కుల కారణంగా స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్న కొందరు వైకాపా ప్రజాప్రతినిధులు నోటిదూలను ప్రదర్శిస్తున్నారు. చరిత్రపై ఏమాత్రం అహగాన లేని వారిలా మాట్లాడుతున్నారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులేమీ లేవన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వల్లే మనకు సంపూర్ణ హక్కులు సంక్రమించాయని పేర్కొన్నారు. 
 
తాడికొండ వైకాపా ఎమ్మెల్యేగా ఈమె కొనసాగుతున్నారు. గురువారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని అంబేద్కర్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు పెను రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇందులో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ వల్ల మనకు వచ్చిందేమీ లేదన్నారు. ఆయన వల్ల మనకు వచ్చిన హక్కులు ఏమీ లేవన్నారు. 
 
బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మనకు రాజ్యాంగ హక్కులు సంక్రమించాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. మరోవైపు, అంబేద్కర్ అభిమానులను ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments