Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులు శూన్యం : వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (08:36 IST)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ద్వారా సంక్రమించిన హక్కుల కారణంగా స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్న కొందరు వైకాపా ప్రజాప్రతినిధులు నోటిదూలను ప్రదర్శిస్తున్నారు. చరిత్రపై ఏమాత్రం అహగాన లేని వారిలా మాట్లాడుతున్నారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులేమీ లేవన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వల్లే మనకు సంపూర్ణ హక్కులు సంక్రమించాయని పేర్కొన్నారు. 
 
తాడికొండ వైకాపా ఎమ్మెల్యేగా ఈమె కొనసాగుతున్నారు. గురువారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని అంబేద్కర్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు పెను రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇందులో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ వల్ల మనకు వచ్చిందేమీ లేదన్నారు. ఆయన వల్ల మనకు వచ్చిన హక్కులు ఏమీ లేవన్నారు. 
 
బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మనకు రాజ్యాంగ హక్కులు సంక్రమించాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. మరోవైపు, అంబేద్కర్ అభిమానులను ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments