Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు : ఆర్కే.రోజా

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండ

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (15:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ, తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం వద్ద  తాకట్టుపెట్టారనీ, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో చంద్రబాబు కీలు బొమ్మలా మారారని ఆరోపించారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులంతా రాజీనామాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
అదేసమయంలో వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటనతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుందని ఆమె చెప్పారు. కలుగులో ఎలుకలా దాక్కుని చంద్రబాబు వేడుక చూస్తున్నారని, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌ను తెరమీదకు తీసుకువచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్నాంటూ రోజా విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments