టీడీపీలో చేరనున్న వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (15:38 IST)
ఏపీలో అధికార వైకాపా గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాటు పార్టీ మారనున్నారు. వైకాపా‌కు రాజీనామా చేసి... చంద్రబాబు చెంతకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెల 5 లేదా 6 తేదీల్లో టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇదేవిషయంపై ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైకాపా టిక్కెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే, జగ్గంపేట టిక్కెట్ ఇవ్వలేమని టీడీపీ పెద్దలు ఆయనకు తేల్చి చెప్పారు. దీంతో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలని టీడీపీ నేతలను కోరినట్టు సమాచారం. 
 
2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు ఓడిపోయారు. కానీ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయనను ఏలేరు ప్రాజెక్టు చైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. అయితే, వైకాపా నుంచి టీడీపీలోకి జ్యోతు నెహ్రూ రావడంతో ఆయన వైకాపాలో చేరారు. 2019లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేమని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో తిరిగి సొంతగూటికి వచ్చేందుకు చంటిబాబు దాదాపుగా నిర్ణయించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments