Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపనమ్మక వ్యవస్థలో పని చేస్తున్నాం.. వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (18:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు. వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తాజాగా రాపూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అపనమ్మక వ్యవస్థలో పని చేస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ ప్రభుత్వాన్ని బాగా విమర్శించాం. ఇపుడు అధికారంలో ఉండి మనమేం చేస్తున్నాం? పనులను ముందుకు తీసుకెళ్లని మనల్ని ప్రజలు నమ్ముతారా? ఏం చేశారని ప్రజలు అడిగితే ఏం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన వలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో మాట్లాడుతూ, తాగడానికి నీళ్లు లేవని, రోడ్లపై గుంతలు పూడ్చలేకపోతున్నామని తెలిపారు. నాలుగేళ్లలో ఏం పని చేశామని ప్రజలు వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతాం? అని ఆనం వ్యాఖ్యానించారు. కండలేరు రిజర్వాయర్ దగ్గరే ఉన్నా రాపూర్‌లో ఒక్క చెరువులో నీళ్లు నింపలేక పోయామని పేర్కొన్నారు. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ కల నెరవేర్చలేక పోయారని ఆనం విచారం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments