వెళ్లేవారు వెళ్ళిపోనివ్వండి.. ఎవరిష్టం వారిది : నేతలతో మాజీ సీఎం జగన్

వరుణ్
గురువారం, 4 జులై 2024 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో వైకాపా ఎక్కువగా సంఖ్యాబలం ఉంది. ఇపుడు వైకాపా అధికారం కోల్పోవడంతో పెక్కుమంది ఎమ్మెల్సీలు టీడీపీ లేదా జనసేన, బీజేపీల్లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసిన పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ, 'వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. ఇప్పుడూ మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం. ఇబ్బందేమీ లేదు' అంటూ నైరాశ్యంతో వ్యాఖ్యానించారు. 
 
'శాసనమండలిలో వైకాపాకు సంఖ్యా బలం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చు, ఇప్పటికే కొందరికి ఫోన్లు వచ్చి ఉంటాయి' అని పార్టీ నేతలతో జగన్ అన్నారు. ఈ మాటలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. దీనిపై జగన్ స్పందిస్తూ, 'గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. వాళ్లలో ఎంత మంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు? అటూ ఇటూ వెళ్లేవారు ఎటూ కాకుండా పోతారు. ఎవరిష్టం వారిది' అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా.. వెనక్కి తగ్గకూడదు, మళ్లీ ముందుకు కదలాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments