Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది.. తక్షణం అరెస్టు చేయాలి : విజయసాయి రెడ్డి

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:45 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది అని, ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మాండ్ చేశారు.
 
మంగళవారం చిదంబరంతో పాటు.. ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ సోదాలు జరిపిన విషయం తెల్సిందే. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కార్తీ చిదంబరం భారీ మొత్తంలో విదేశాలకు సొమ్ములు చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడులపై విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది. ఆయనకు నైతికతే లేదు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలి. మనీ లాండరింగ్ నుంచి చైనా పౌరులకు లంచాలు తీసుకుని చిదంబరం వీసాలు ఇప్పించారు. ఐపీసీలోని అన్ని రకాల సెక్షన్లకు సరిపోయే నేరాలకు చిదంబరం పాల్పడ్డారని, అందువల్ల ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలి" అని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments