చంద్రబాబు కారుపై బాంబుతో దాడిచేస్తాం : వైకాపా నేత

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:31 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం వస్తే ఆయన కారుపై బాంబుతో దాడి చేస్తామంటూ వైకాపా నేత, రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్‌ హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయంతెల్సిందే. ఒకరు ఒక మాటంటే.. తామేం వాళ్లకు తక్కువేం కాదని రెచ్చిపోయి మరీ ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. 
 
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టగా దీనికి పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్ష చేపట్టింది. దీక్షాస్థలి నుంచి కూడా అటు టీడీపీ నేతలు ఇటు వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దీంతో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియక ఆయా పార్టీల కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
 
ముఖ్యంగా, చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై రెప్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ రెచ్చిపోయారు. బూతు పురాణం లంఘించారు. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా... అంటూ హెచ్చరించారు. 
 
ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెంథిల్ మాట్లాడుతున్నంత సేపు రెడ్డెప్ప సహా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అంతేకాదు ఇంకా చాలా బూతులే సెంథిల్ మాట్లాడారు. ఇన్నేసి మాటలు మాట్లాడినప్పటికీ స్టేజ్‌పై ఉన్న నేతలంతా ఆయన్ను ఎంకరేజ్ చేశారో కానీ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం