Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిల రాకతో సీఎం జగన్ పనైపోయింది... : విష్ణుకుమార్ రాజు

వరుణ్
బుధవారం, 24 జనవరి 2024 (15:00 IST)
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పని అయిపోయిందని భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఇదేవిషయంపై ఆయన మాట్లాడుతూ, ఇపుడు సీఎం జగన్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల చేపట్టడంతో వైకాపా పని అయిపోయిందన్నారు. జగన్ పార్టీలో ఉన్నవారు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారేనని ఇపుడు వీరంతా ఆ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలిపారు. 
 
ఒక ఎమ్మెల్యేకు సంవత్సరం, ఒకటిన్న సంవత్సరం నుంచి సీఎం అపాయింట్మెంట్ లేకపోతే అదేం పార్టీ, దిక్కుమాలిన పార్టీ అని అన్నారు. ఇది చాలా అవమానంతో కూడుకున్న వ్యవహారమని, అలాంటి పార్టీలో ఎమ్మెల్యేలు ఉండటం వారికి సిగ్గుచేటని చెప్పారు. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వారే కనుక, రాబోయే రోజుల్లో వైకాపా నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అన్నారు. షర్మిల వల్ల వైకాపా ఓటు బ్యాంకు కనీసం పది శాతం చీలుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. 
 
ఏపీలో బీజేపీ - జనసేన మధ్య, జనసేన - టీడీపీల మధ్య పొత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలవాల్సి ఉందని విష్ణు కుమార్ రాజు తెలిపారు. ఈ మూడు పార్టీలు కలిస్తే మాత్రం ఏకంగా 150కి పైగా సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments