Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటున్న వైకాపా ఎమ్మెల్యే.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (09:16 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కీలక ప్రకటన చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. 
 
ఇటీవల ఎమ్మిగనూరులోని ఉప్పర సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని సీఎం జగన్ కోరారని, కానీ, తన వయసు 83 యేళ్లు అని, గుండె జబ్బు కూడా ఉందని గుర్తుచేసి పోటీ చేయలేనని చెప్పినట్టు తెలిపారు. 
 
పైగా, తాను ప్రజలతో కలిసి ఎక్కువ సేపు తిరగలేనని, ఎక్కువ సేపు మాట్లాడలేనని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, అసెంబ్లీ టిక్కెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఒకవేళ తన కొడుక్కి టిక్కెట్ వస్తే ప్రజలంతా సహకరించి గెలిపించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments