Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఆఫీసులకు పార్టీ రంగులు వేసిన మీరా మాట్లాడేది : నాదెండ్ల మనోహర్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:49 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రాష్ట్ర పర్యటన కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనం రంగుపై వైకాపా నేతలు విమర్శలు గుప్పించడాన్ని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి ఆపై హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న మీరా మాతో మాట్లాడేది అంటూ ప్రశ్నించారు. వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత వైకాపా నేతలకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. 
 
జనసేన ఎపుడూ చట్టానికి వ్యతిరేకంగా పని చేయదన్నారు. ఎన్నికల్లో వారాహి ప్రచార వాహనంగా ఉపయోగపడుతుందన్నారు. విజయనగరం జిల్లా జగనన్న కాలనీలను సందర్శించడానికి వెళ్తే తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. బీసీ గర్జనకు ఎన్ని ఆర్టీసీ బస్సులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఏపీఎస్ఆర్టీసీ వైఎస్ఆర్టీసీగా మార్చివేశారని ఆరోపించారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని సర్పంచ్‌లు పోరాడుతుంటే వారి చెక్ పవర్ లాగేసుకున్న ఘనత వైకాపా పాలకులకే ఉందన్నారు. 
 
ఏపీ తెలంగాణ మళ్లీ కలవాలనేదే తమ విధానమన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు సజ్జల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలు కలవాలన్నపుడు 3 నెలల్లోనే ఏపీ ఆస్తులను తెలంగాణాకు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments