Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి... రాష్ట్రాభివృద్ధి కోసం 9 అంశాలు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (17:23 IST)
త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా పార్లమెంట్ అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. ఇందులో వైకాపా తరపున ఆ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా వారు ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎంపీలు.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధానమైన 9 అంశాలను లేవనెత్తారు. రెవెన్యూ లోటు బకాయిలు రూ.18,969 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. 
 
అలాగే, నవ్యాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు రూ.23 వేల కోట్లను అడిగిన ఎంపీలు... పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,283 కోట్లను కేంద్రం తక్షణం రీఎంబర్స్‌ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 
 
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను ఆమోదించాలని.. రాజధాని నగరం అభివృద్ధి కోసం గ్రాంట్‌గా రూ.47,424 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంట్‌కు ఆర్థిక సాయం చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, ఇలా మొత్తం 9 అంశాలతో కూడిన అభివృద్ధి అజెండాతో జాబితాను అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments