Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారుపై ప్రతిపక్షాల అవిశ్వాసం.. విశ్వాస పక్షంగా వైకాపా

Webdunia
గురువారం, 27 జులై 2023 (12:35 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు అనేక ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఇందుకోసం లోక్‌సభ స్పీకర్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసును ఇచ్చింది. దీన్ని స్వీకరించిన ఆయన.. అవిశ్వాస పరీక్షకు సమ్మతం తెలిపారు. అయితే, ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ సర్కారుకు విశ్వాసంగా ఉండాలని వైకాపా నిర్ణయించింది.
 
గత 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి మరోమారు అండగా నిలవాలని నిర్ణయించింది. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి ప్రభుత్వాన్ని బయటపడేయడంతోపాటు ఢిల్లీలో సేవల నియంత్రణకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లుకు కూడా మద్దతివ్వాలని నిర్ణయించింది. దీంతో ఈ రెండు గండాల నుంచి ప్రభుత్వం ఈజీగా బయటపడేలా కనిపిస్తోంది.
 
వైసీపీకి రాజ్యసభలో 9 మంది, లోక్‌సభలో 22 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లుల సమయంలో వీరంతా అండగా నిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సేవల నియంత్రణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించినా రాజ్యసభలో తగినంత మెజారిటీ లేకపోవడంతో అక్కడ చిక్కుకుపోయే అవకాశం ఉంది.
 
ఈ పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయడం ద్వారా దానిని బయటపడేయాలని చూస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో మరింత స్పష్టతనిచ్చారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా, బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments