Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (17:50 IST)
వైకాపాకు చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను హైకోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదైవున్నాయి. ఈ నాలుగు కేసుల్లో ఆయన ఇప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై బయట ఉంటున్నారు. కానీ, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం.. నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించింది. ఈ పిటిషన్లపై జూన్ 20వ తేదీన హైకోర్టులో వాదనలు ముగియగా, బుధవారం తీర్పును వెలువరించింది. 
 
కాగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున బూత్‌లో పిన్నెల్లి ఈవీఎంలను బద్ధలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను కూడా దుర్భాషలాడారు. పోలింగ్ మరుసటి రోజున పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నింటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లోనే ఆయనను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments