వైకాపా - టీడీపీ - జనసేన అన్నీ బీజేపీ ఒకేగూటి పక్షులు : కేవీపీ

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (08:15 IST)
వైఎస్ఆర్ ఆత్మగా పేర్కొనే డాక్టర్ కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార వైకాపా, విపక్ష టీడీపీ, జనసేన పార్టీలన్నీ ఒకే గూటి పక్షులని ఆరోపించారు. పైగా, 30 మందికిపైగా ఎంపీలు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, వైఎస్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రులు అయితే కాదు.. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితేనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ సంతోషిస్తుందని ఆయన అన్నారు.
 
విజయవాడ కేంద్రంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ జరిగింది. ఇందులో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ, వైఎస్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రులు కావడం కంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే వైఎస్ఆర్ ఆత్మ సంతోషిస్తుందని తెలిపారు. పార్లమెంటులో వైకాపా, టీడీపీలకు చెందిన 36 మంది ఎంపీల బలం ఉందన్నారు. అయినప్పటికీ ప్రధాని మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించలేకపోతున్నందుకు ఓ తెలుగువాడిగా సిగ్గుపడుతున్నట్టు చెప్పారు. 
 
వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలన్నీ బీజేపీ పక్షులేనని ఆరోపించారు. అదానీ అక్రమాలపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపీసీసీ వ్యవహారాల ఇన్‍‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, ఎన్.రఘువీరా రెడ్డి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments