Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా - టీడీపీ - జనసేన అన్నీ బీజేపీ ఒకేగూటి పక్షులు : కేవీపీ

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (08:15 IST)
వైఎస్ఆర్ ఆత్మగా పేర్కొనే డాక్టర్ కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార వైకాపా, విపక్ష టీడీపీ, జనసేన పార్టీలన్నీ ఒకే గూటి పక్షులని ఆరోపించారు. పైగా, 30 మందికిపైగా ఎంపీలు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, వైఎస్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రులు అయితే కాదు.. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితేనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ సంతోషిస్తుందని ఆయన అన్నారు.
 
విజయవాడ కేంద్రంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ జరిగింది. ఇందులో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ, వైఎస్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రులు కావడం కంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే వైఎస్ఆర్ ఆత్మ సంతోషిస్తుందని తెలిపారు. పార్లమెంటులో వైకాపా, టీడీపీలకు చెందిన 36 మంది ఎంపీల బలం ఉందన్నారు. అయినప్పటికీ ప్రధాని మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించలేకపోతున్నందుకు ఓ తెలుగువాడిగా సిగ్గుపడుతున్నట్టు చెప్పారు. 
 
వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలన్నీ బీజేపీ పక్షులేనని ఆరోపించారు. అదానీ అక్రమాలపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపీసీసీ వ్యవహారాల ఇన్‍‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, ఎన్.రఘువీరా రెడ్డి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments