Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి... అరెస్టు ఖాయమా?

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (08:17 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణ పూర్తి చేసిన సీబీఐ ఇపుడు మరోమారు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 
 
మరోవైపు, వివేకా హత్య కేసులో ఆదివారం తెల్లవారుజామున అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరయ్యే అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం లేకపోలేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో నేడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 
 
కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచగా, జడ్జి.. 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‍‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన వెంటనే అవినాష్‌ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments