Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి... అరెస్టు ఖాయమా?

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (08:17 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణ పూర్తి చేసిన సీబీఐ ఇపుడు మరోమారు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 
 
మరోవైపు, వివేకా హత్య కేసులో ఆదివారం తెల్లవారుజామున అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరయ్యే అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం లేకపోలేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో నేడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 
 
కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచగా, జడ్జి.. 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‍‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన వెంటనే అవినాష్‌ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments