Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి... అరెస్టు ఖాయమా?

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (08:17 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణ పూర్తి చేసిన సీబీఐ ఇపుడు మరోమారు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 
 
మరోవైపు, వివేకా హత్య కేసులో ఆదివారం తెల్లవారుజామున అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరయ్యే అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం లేకపోలేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో నేడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 
 
కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచగా, జడ్జి.. 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‍‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన వెంటనే అవినాష్‌ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments