కడప వైకాపా ఎంపీ అవినాశ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (15:46 IST)
వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైపాకాకు చెందిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ మరోమారు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేయగా, బుధవారం మరోమారు జారీచేసింది. జనవరి 28వ తేదీన తర్వాత తమ హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని తాజా నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 
 
కాగా, వివేకా హత్య కేసును సీబీఐ గత మూడున్నరేళ్లుగా హత్య చేస్తుంది. గత 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ ప్రధానంగా అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో వీరిద్దరినీ ఇప్పటివరకు సీబీఐ విచారించలేదు. 
 
ఈ పరిస్థితుల్లో తొలిసారి ఆయనకు విచారణకు రావాల్సిందిగా మూడు రోజుల క్రితం సీబీఐ ఆదేశాలు జారీచేసింది. అయితే నోటీసుల ఇచ్చిన వెంటనే విచారణకు రావాలంటే ఎలా అని అవినాశ్ మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో సీబీఐ ఈ దఫా 28వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టంగా పేర్కొంటూ తాజాగా నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments