Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప వైకాపా ఎంపీ అవినాశ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (15:46 IST)
వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైపాకాకు చెందిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ మరోమారు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేయగా, బుధవారం మరోమారు జారీచేసింది. జనవరి 28వ తేదీన తర్వాత తమ హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని తాజా నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 
 
కాగా, వివేకా హత్య కేసును సీబీఐ గత మూడున్నరేళ్లుగా హత్య చేస్తుంది. గత 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ ప్రధానంగా అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో వీరిద్దరినీ ఇప్పటివరకు సీబీఐ విచారించలేదు. 
 
ఈ పరిస్థితుల్లో తొలిసారి ఆయనకు విచారణకు రావాల్సిందిగా మూడు రోజుల క్రితం సీబీఐ ఆదేశాలు జారీచేసింది. అయితే నోటీసుల ఇచ్చిన వెంటనే విచారణకు రావాలంటే ఎలా అని అవినాశ్ మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో సీబీఐ ఈ దఫా 28వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టంగా పేర్కొంటూ తాజాగా నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

Rukmini Vasanth: ఎస్కే, రిషబ్, యష్, ఎన్టీఆర్‌తో రుక్మిణి వసంత్ సినిమాలు.. పాన్ ఇండియా హీరోయిన్‌గా?

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments