Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ జయంతి రోజున వైఎస్.షర్మిల కొత్త పార్టీ!

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:12 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ స్థాపన తథ్యమైపోయింది. తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించనుంది. ఈ పార్టీ స్థాపనకు కూడా ముహుర్తాలను కూడా ఆమె ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం రెండు తేదీలను ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వీటిలో ఒకటి మే 14వ తేదీ కాగా, మరొకటి జూలై 8వ తేది. ఈ రెండు తేదీలకు ఓ ప్రత్యేకత ఉంది. వైఎస్. షర్మిల తండ్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో తేదీ అయిన జూలై 8.. వైఎస్ఆర్ జయంతి. ఈ రెండు తేదీల్లో ఒక తేదీన కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ప్రజల గుండెల్లో చెరగిపోని స్థానాన్ని వైఎస్ఆర్ సంపాదించుకున్నారు. దీంతో ఆయన జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. దీంతో వైఎస్ఆర్ జయంతి రోజునే పార్టీ వ్యవస్థాపక తేదీగా షర్మిల ఎంచుకున్నట్టు ఆమె సన్నిహితుల మాటగావుంది. 
 
కాగా, షర్మిల ఇప్పటికే పార్టీ ఏర్పాటు అంశంపై వివిధ జిల్లాలకు చెందిన నేతలతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అలాగే, ఒక్కో జిల్లాలో ఈ తరహా సమావేశాలు నిర్వహించి, స్థానిక నేతలు ఇచ్చే సూచనలు, సలహాలతో పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments