Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్టింట వైరల్ అవుతున్న వైఎస్‌ షర్మిల తనయుడి వివాహ ఫోటోలు

సెల్వి
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (10:42 IST)
Raja Reddy marriage
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తనయుడు రాజా రెడ్డి వివాహం శనివారం సాయంత్రం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. 
 
వివాహ వేడుకలో భాగంగా జరిగిన ‘హల్దీ’ వేడుక ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో కొత్త జంట రాజా రెడ్డి-ప్రియ, వైఎస్ విజయమ్మ, షర్మిల-అనిల్ దంపతులు, కుమార్తె అంజలి, వధువు అట్లూరి ప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కనిపించారు.
 
ఈ సందర్భంగా రాజా రెడ్డి, ప్రియ సొగసైన తెల్లటి సాంప్రదాయ దుస్తులను ధరించారు. రాజా రెడ్డి తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, ప్రియ తెల్లటి లెహంగాలో అందంగా కనిపించింది. వారి చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
అయితే వైఎస్ షర్మిల సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజారెడ్డి, ప్రియల వివాహ వేడుకకు హాజరుకాలేదు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ అనివార్య కారణాల వల్ల ఏపీ సీఎం హాజరుకాలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Raja Reddy marriage
 
ఫిబ్రవరి 16న ప్రారంభమైన మూడు రోజుల వివాహ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. ఇప్పటికే సంగీత్, మెహందీ, పెళ్లి వంటి కార్యక్రమాలు బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments