Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఠాగూర్
బుధవారం, 1 మే 2024 (14:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నవ సందేహాలతో ఓ బహిరంగ లేఖ రాశారు. మొత్తం తొమ్మిది ప్రశ్నలను సంధించిన ఆమె.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. 
 
అంతేకాకుకుండా, సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌ నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? అని చెప్పారు. 
 
ఎస్టీ ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిపోయింది? ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఎందుకు నిరాకరించారు? స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారు? డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యీ అనంతబాబుకు ఎందుకు సమర్థిస్తున్నారు? అంటూ షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి పదేపదే ప్రస్తావిస్తుండటంతో షర్మిల ఇపుడు నవ సందేహాలతో నవ ప్రశ్నలను సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments