Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఘాయిత్యాలపై ప్రథమ స్థానం... అభివృద్దిలో అట్టడుగు స్థానం : వైఎస్ షర్మిల

ఠాగూర్
మంగళవారం, 19 నవంబరు 2024 (17:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తగా అడుగంటి పోయాయని, మహిళలపై అఘాయిత్యాలు, డ్రగ్స్ వినియోగంలో మొదటి స్థానంలో ఉందన, అభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థానంలో ఉందని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలను, అఘాయిత్యాలను నివారించడంలో గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఇవాళ రాష్ట్ర శాసనమండలిలో జరిగిన చర్చే అందుకు నిదర్శనమన్నారు.
 
'2014-19 మధ్య రాష్ట్రంలో 83,202 కేసులు నమోదయ్యాయట. 2019-24 మధ్య నమోదైనవి 1,00,508 కేసులట. తమ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని టీడీపీ ఆరోపిస్తే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకు సగటున 59 అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయని వైసీపీ అంటోంది.
 
గత పదేళ్లలో దాదాపు రెండు లక్షల కేసులు నమోదయ్యాయంటే, మహిళలకు భద్రత కల్పించడంలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో నేరాలను అరికట్టలేని వైసీపీ, టీడీపీ సిగ్గుతో తలదించుకోవాలి. నిర్భయ, దిశ వంటి చట్టాలు పేరుకు మాత్రమే. మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే నిర్భయ చట్టం కింద 40 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు... దిశ చట్ట కింద 20 రోజుల్లోనే చర్యలు తీసుకుంటామని జగన్ మహిళల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారే తప్ప... చట్టాలను మాత్రం అమలు చేయలేదు. పదేళ్లలో ఒక్క నేరస్తుడికైనా కఠిన శిక్ష పడిందా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.
 
కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. అభివృద్ధిలో చివరిస్థానం... డ్రగ్స్ వాడకంలో, మహిళలపై అఘాయిత్యాలలో ప్రథమస్థానం... ఇదీ మన రాష్ట్ర దుస్థితి అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments