Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

ఠాగూర్
మంగళవారం, 10 జూన్ 2025 (16:19 IST)
వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఏపీ పీసీసీ చీప్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఓ మూర్ఖుడులా మాట్లాడారన్నారు. వైకాపా నేతలకు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. ఆమె మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో విలేకరులతో మాట్లాడుతూ, మహిళను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందన్నారు. 
 
సజ్జల కుమారుడు భార్గవ రెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనపై కూడా దుష్ప్రచారం చేశారు. వైఎస్ కుమార్తె, ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారు. జగన్ అందరినీ నా అక్క చెల్లెళ్లు అని అంటారు. కానీ, ఆయన సొంత చెల్లికే మర్యాద లేదు. ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారు అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. 
 
ఇకపోతే, తమ పార్టీలో కొందరి తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమన్నారు. అందులో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందకు లాగేవారు ఉంటారన్నారు. వారే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పార్టీకి క్రమశిక్షణ కమిటి ఉందని, అలాంటి వారిలో ఆ కమిటి తగిన చర్యలు తీసుకుంటుందని, పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించే వారిని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments