Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (19:55 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిలుపై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో వివేకా కుమార్తె సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సునీతను ఏమైనా చేస్తారనే భయం తమలో ఉందని చెప్పారు. ఇటీవల తనకు కొన్ని విషయాలు తెలిశాయని, అవి తనను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని ఆమె గుర్తుచేశారు. 
 
అవిశాన్ బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను పేర్కొందని తెలిపారు. విచారణ అధికారులను అవినాశ్ పిలిపించుకుని బెదిరించినట్టు అందులో పేర్కొన్నారని, తప్పుడు రిపోర్టుపై అధికారులతో అవినాశ్ సంతకాలు చేయించినట్టు ఉందని చెప్పారు. 
 
అవినాశ్ బెయిల్‌పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని అన్నారు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించినట్టు తప్పుడు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. హత్య జరిగినపుడు ఘటనాస్థలిలో ఉన్నది అవిశాన్ రెడ్డేనని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments