Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఈపీఎఫ్ సొమ్ము విత్‌డ్రా మరింత సులభతరం...

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (19:21 IST)
ఉద్యోగ భవిష్యత్ నిధి (ఈపీఎఫ్ఓ) సంస్థ నుంచి ఆన్‌లైన్‌లో నగదు ఉపసంహరణ మరింత సులభతరం చేసింది. ఇకపై ఆన్‌లైన్‌లో డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే క్యాన్సిల్ చెక్కును అప్‌లోడ్ చేసే అవసరాన్ని తప్పించింది. దీంతోపాటు బ్యాంకు ఖాతాను యజమానులు ధృవీకరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియతో దాదాపు ఎనిమిది కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. 
 
ప్రస్తుతం ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో నిధులు ఉపసంహరణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే యూఏఎన్ లేదా పీఎఫ్ నంబరుతో లింక్ చేసిన బ్యాంక్ పాస్‌బుక్‌కు సంబంధించిన చెక్కు ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 
 
ఆ తర్వాత దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా వివరాలు కూడా యజమానులు ఆమోదించాల్సి ఉంటుంది. అంటే ఈ రెండంచెల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే నగదు చేతికందేది. ఈ అవసరాన్ని ఈపీఎఫ్‌లో పూర్తిగా తొలగించినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు క్లెయిమ్ తిరస్కరణల్ని తగ్గించేందుకు ఈ చర్యలు సాయపడుతాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments