నా కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల

ఠాగూర్
సోమవారం, 8 సెప్టెంబరు 2025 (17:21 IST)
తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని ఆయన తల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ నెల 2వ తేదీన ఆమె తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. 
 
అలాగే, సోమవారం తన తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలు పర్యటనకు వెళ్లారు. పర్యటనకు ముందు హైదరాబాద్ నివాసంలో అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కర్నూలు చేరుకుని, ఉల్లి మార్కెట్‌లో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ షర్మిల తన కుమారుడు రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆమె స్పష్టం చేశారు. సరైన సమయం వచ్చినపుడు రాజారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతాడని ఆమె ప్రకరటించారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. కాగా, ఈ కర్నూలు పర్యటనలో రాజారెడ్డి తన తల్లి పక్కనే కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments