Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులాభారం మొక్కు తీర్చుకున్న ముఖ్య‌మంత్రి జగన్

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:19 IST)
తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర‌స్వామివారిని రాష్ట్ర  ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంగ‌ళ‌వారం ఉద‌యం దర్శించుకున్నారు. ముందుగా  ఆలయం వ‌ద్ద‌కు చేరుకున్న ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు.
 
స్వామివారి ద‌ర్శ‌నానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్ష్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆల‌యంలోని తులాభారం మొక్కు తీర్చుకున్నారు.
 
శ్రీ‌వారి అనుగ్ర‌హంతో కోరిక‌లు తీరిన భ‌క్తులు త‌మ బ‌రువుకు స‌మానంగా బెల్లం లేదా బియ్యం లేదా ఇత‌ర ధాన్యాల‌తో తూకం వేసి స్వామివారికి స‌మ‌ర్పించ‌డం ఆనాదిగా వ‌స్తున్న సంప్ర‌దాయం. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం తులాభారంలో సమర్పించి మొక్కు చెల్లించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments