Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం 12 గంటలకు జగన్ .. రాత్రి 7 గంటలకు మోడీ ప్రమాణం

Webdunia
సోమవారం, 27 మే 2019 (08:27 IST)
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన నరేంద్ర మోడీ, వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవ్యాంధ్ర సీఎంగా వైఎస్. జగన్ 30వ తేదీ గురువారం ప్రమాణం చేస్తారు. ఆయన గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణం చేస్తారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే రోజు రాత్రి 7 గంటలకు ప్రమాణం చేస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో మోడీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఈయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం రాత్రి 7 గంటలకు జరుగుతుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మోడీతో పాటు మరికొంతమంది మంత్రులు ప్రమాణం చేస్తారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments