Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ సీపీకి వైఎస్ జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు...

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (09:37 IST)
తమ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్ఆర్సీపీ) తమకు తెలియజేసిందని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పార్టీ పేరు సవరణ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌కు శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్‌ రెడ్డిని ఎన్నుకున్నట్లు పత్రికల్లో వచ్చిందని, పార్టీ వైపు నుంచి ఎటువంటి ప్రకటన లేనందున దానిపై స్పష్టత ఇవ్వాలంటూ ఎంపీ రఘురామ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈసీఐకి లేఖ రాశారు. 
 
దీనిపై స్పందించిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆ పార్టీ ఇచ్చిన సమాచారాన్ని పేర్కొంటూ రఘురామకు లేఖను పంపించింది. అలాగే తమ పార్టీ పేరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదా వైఎస్సార్‌సీపీగా మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ వివరించిందని కూడా ఆ లేఖలో ఈసీఐ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments